16/11/2017
Smartphone తయారీ కంపెనీలకి ఇండియా అతి కీలకమైన మార్కెట్. ఎలాగైనా ఇండియాలో వినియోగదారులు వాడే smartphoneలలో అధిక శాతం వాటాని దక్కించుకోగలిగితే అగ్రస్థానంలో ఉన్నట్లే.
సుదీర్ఘకాలంగా ఇండియాలో Samsung అగ్రస్థానాన్ని అనుభవిస్తూ వచ్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ IDC వెలువరించిన ఫలితాల ప్రకారం మొట్టమొదటిసారిగా Samsung చైనాకి చెందిన Xiaomiతో అగ్ర స్థానాన్ని పంచుకోవలసిన దుస్థితి దాపురించింది. దేశంలో వినియోగంలో ఉన్న smartphoneలలో ఈ రెండు సంస్థలూ తలో 23.5 శాతం వాటాని దక్కించుకున్నాయి.
Lenovo 9 శాతం వాటానీ, Vivo 8.5 శాతం, Oppo 7.5 వాటానీ దక్కించుకున్నాయి. అయితే Xiaomi ఇంతగా ఎదగడానికి తక్కువ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు ఉన్న phoneలను అందించడం ఓ కారణం అయితే Samsung ప్రదర్శించిన తలపొగరు మరో కారణం. వ్యాపార సంస్థలకు తల పొగరు ఉండకూడదు. కానీ Samsung క్రమేపీ ఇండియాలో తగ్గుతున్న అమ్మకాలను తట్టుకోలేక తల పొగరు ప్రదర్శించింది. తత్ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తోంది.
ముఖ్యంగా Xiaomi సంస్థ Big C, Sangeeta వంటి రిటైల్ షాపుల ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించిన తరుణంలో Xiaomi phoneలను విక్రయించే షాపుల వాళ్లకి Samsung phoneలను సప్లై చెయ్యడం నిలిపివేస్తామని Samsung సంస్థ బెదిరించింది. ఇది అమ్మకాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇప్పటికైనా Samsung తాను చేస్తున్న తప్పులు గ్రహించి సరిచేసుకోపోతే తన budget phoneల మార్కెట్ని పూర్తిగా Xiaomiకి సమర్పించుకోక తప్పదు.